Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ కమిటీ ముందు హాజరైన క్రికెటర్
కొలంబో : 2011 వరల్డ్కప్ ఫైనల్ ఫిక్సింగ్ అయ్యిందంటూ శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిదానంద ఆరోపణలతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐయు)ను నియమించింది. దర్యాప్తు బృందం వరుసగా ఒక్కొక్కరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ అరవింద డిసిల్వను దర్యాప్తు బృందం సుమారు ఆరు గంటల పాటు విచారించింది. ఫైనల్ మ్యాచ్కు ముందు శ్రీలంక జట్టులోకి ఇద్దరు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయగా.. సెమీఫైనల్స్ నెగ్గిన జట్టులో నాలుగు మార్పులతో తుది పోరుకు బరిలోకి దిగారు. వరల్డ్కప్ ఫైనల్లో 20 బంతుల్లో 2 పరుగులే చేసిన బ్యాట్స్మన్ ఉపుల్ తరంగను దర్యాప్తు బృందం బుధవారం సుమారు రెండు గంటల పాటు విచారించింది. తరంగపై జట్టు సెలక్షన్, జట్టు సమావేశం సహా ఇతర వివరాలు అడినట్టు తెలుస్తోంది.