Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
కోవిడ్ నేపథ్యంలో కోఠి మహిళా కళాశాలకు చెందిన దూదేకుల తస్లీమ్ నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొంది పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 11/10/2020న నిర్వహించిన ఎంట్రన్స్ పరీక్షలలో ఎకనామిక్స్ విభాగంలో 205008 హాల్టికెట్ నెంబర్తో 2వ ర్యాంకు సాధించింది.కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన ఈ విద్యార్థి ర్యాంకు సాధించడం పట్ల ఆ ఫోరం అధ్యక్షులు డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య హర్షం వ్యక్తం చేశారు.అసోసియేషట్ అధ్యక్షులు భాస్కర్రెడ్ది, వర్కింగ్ అధ్యక్షులు నరేష్, కార్యదర్శి సుల్తానా, ఉపకార్యదర్శి కొండల్, కార్యవర్గ సభ్యులు కవిత, శోభ, ప్రవళిక, అరవింద్కుమార్ తస్లీమ్ను అభినందించారు.