Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఖమ్మం జిల్లా పల్లెగుడెంలో జరిగిన అత్యాచారం ఘటనలో చనిపోయిన చిన్నారిని ఎవరికీ తెలియండా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది అంత్యక్రియలు చేయడం ఎందుకని మహిళ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానికంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు పోలెబోయిన వరలక్ష్మి మాట్లాడుతూ ఎవరూ రాకుండా శవాన్ని అదరా బాదరా పూడ్చడం ఎందుకని ప్రశ్నించారు. నిందుతులను కాపాడేందుకే అని అన్నారు. ఇది హత్రాస్ ఘటన కంటే ఎక్కువగా ఉందన్నారు. ఈ ఘటనకు కారణమైన మారయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రభుత్వం హామీనిచ్చిన రూ.2 లక్షలు, డబుల్ బెడ్రూం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నారికి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మహిళ, యువజన, విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చెస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్ళు గాదె పద్మమ్మ, పూలమ్మ, అరుణ పాల్గొన్నారు.