Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో వైరస్పై పెరిగిన అవగాహన
- జీవనంలో భాగమైన మాస్కులు, శానిటైజర్లు
- శీతాకాలంలో మరింత వ్యాప్తి చెందే అవకాశం
- భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలంటున్న వైద్యులు
నవతెలంగాణ-సూర్యాపేట
ఎనిమిది నెలల నుండి కరోనా మహమ్మారి ప్రజలను భయబ్రాంతులను చేస్తున్న విషయం విధితమే.మొదట రెండు నెలల లాక్ డౌన్ సమయంలో ఎంతగానో భయభ్రాంతులకు గురైన జనం లాక్డౌన్ సడలింపులతో వైరస్తో పాటు సహజీవనం చేయడం మొదలుపెట్టారు.బయటకు వెళ్లాలంటే భయపడే స్థితి నుండి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు సైతం కొనసాగి స్తున్నారు.ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో శానిటైజర్స్, మాస్కులు జీవనంలో భాగమయ్యాయి. గతంలో రోజుకు రెండు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ స్థితి నుంచి ఇప్పుడు 50 లోపు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ప్రజలు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో నిర్లక్ష్యంగా ఉండకుండా భౌతికదూరం పాటించి, మాస్కూలు, శానిటైజర్లను వినియోగించడంతో కరోనా కట్టడి చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.
పెరిగిన రద్దీ....
అన్లాక్ ప్రక్రియ మొదలవడంతో అన్ని ప్రాంతాలలో జనజీవనం యథాస్థితికి చేరు కుంటుంది.రోడ్లు, విధులు జనంతో నిండి పోతు న్నాయి.ఆర్టీసీ బస్సులో ప్రయాణం పెరగడంతో పాటు ఇతర ప్రజారవాణాలోను ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వ్యక్తిగత పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం ఇలా అందరూ ఎవరి పనులు వారు వెళ్తుండడం, విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహణ, ఎంట్రన్స్ల నిర్వహణ, ఉన్నత చదువులకు కౌన్సెలింగ్, ఇంటర్, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ఇలా విద్యార్థులు కూడా బయటకు వస్తుండడంతో సాధారణ స్థితికి వస్తోంది.పట్టణంతో పాటు మండలకేంద్రాల్లోనూ రద్దీ పెరిగింది.కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో గతంలో అనేకమంది మతి చెందగా గతంతో పోలిస్తే మతుల సంఖ్య బాగా తగ్గింది. దీనికితోడు రికవరి రేటు పెరగడం.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం కొంత ఊరట కలిగించే అంశం.
వద్ధులు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్త....
కరోనా వైరస్ సోకకుండా వద్ధులు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.మొదట్లో వైరస్ తీవ్రత అధికంగా ఉండగా ఇప్పుడు పాజిటివ్ వచ్చినవారు 12 రోజుల లోపే కోలుకుంటుండడంతో భయపడడం లేదు.రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారికి ఇబ్బంది లేకపోయినా వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.వచ్చేది చలికాలం కావడంతో జాగ్రత్తలు పాటిస్తే కరోనా మహమ్మారి నుండి బయటపడేందుకు అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి
డీఎంహెచ్ఓ-కర్పూరపు హర్షవర్థన్
పాజిటివ్ కేసులు కొంతమేరకు తగ్గుతున్న చలికి మాత్రం కేసులు పెరిగే అవకాశం ఉంది.ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.వచ్చేది పండుగల సీజన్ కావడంతో అందరూ ఒకేచోట చేరకుండా ఎవరి ఇంట్లో వారు పండగలు జరుపుకోవాలి.మరోసారి కరోనా వైరస్ విజంభించే అవకాశం ఉండడం, అన్లాక్తో జనజీవనం సాధారణం కావడంతో గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.మాస్క్లు ధరిస్తూ భౌతికదూరం పాటిస్తూ ఎప్పుటికప్పుడు చేతులను కడుక్కోవడంతో పాటు శానిటైజర్ చేసుకోవాలి.