Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి:అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని కోల్ ముంతల పహాడ్ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన పిట్టల నర్సింహా కొండమల్లేపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహి స్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కొన్ని రోజులుగా పెద్ద కుమార్తె హిమ వర్షిని అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను కోల్ముంతలపహాడ్ స్టేజీ సమీపాన ఉన్న సయ్యద్ సలీం అనే భూతవైద్యుని వద్ద చికిత్స చేయిస్తున్నారు. బుధవారం భూత వైద్యుని వద్ద చికిత్స చేయిస్తుండగా హిమ వర్షిని మృతి చెందింది. మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్సై భాస్కర్ రెడ్డిని వివరణ కోరగా యువతి మృతిపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదన్నారు.