Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండల పరిధిలోని చెరువుగట్టులో గల శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీని బుధవారం లెక్కించారు. 23 రోజులకు గాను రూ.20,79,30 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో అన్నెపర్తి సులోచన తెలిపారు. అమ్మవారి గుడిలో రూ.2,13,580 రాగా, గట్టుపైన రూ.18,65,450 ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ మేకల అరుణ రాజిరెడ్డి, దేవాదాయ శాఖ డివిజన్ పరిశోధకురాలు వెంకటలక్ష్మి, ధర్మకర్తలు యాదగిరి, యాదయ్య, రాధారపు బిక్షపతి, దండు శంకరయ్య, ప్రభాకర్రెడ్డి, కొండేటి వేణు, ఎక్స్ అఫిషియో సభ్యులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, దేవస్థాన సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, వంశీ, శ్రీనివాస్రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.