Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ , నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొరిగిట సోములు విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని సీఐటీయూ భవనంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారి కూలి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పోల్చుకుంటే సరిపోవడం లేదన్నారు. కనీసం మూడు పూటలా తిండికి సరిపోవడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి ఇలియాస్, ప్రధాన కార్యదర్శి తెల్లా శేఖర్, కోశాధికారి నరసింహ, పట్టణ అధ్యక్షులు మాండ్ర మల్లేశం, కార్యదర్శి చింతల నాగరాజు, యూసుఫ్, కందుల నరసింహ, అశోక్, గోరయ్య, యూసుఫ్, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు, గోల్లురి నాగరాజు, దుర్క నరసింహ, సైదులు, మల్లేశం, కష్ణారావు, చిన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.