Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మునుగోడు
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికీ అండగా ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన అన్నం సైదులు కుమారుడు రిషికేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే సహకారంతో మంజూరైన రూ.లక్ష ఎంవోసీని హైదరాబాద్లోని తమ నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజక వర్గంలోని ప్రజలు, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తీర్చేందుకు ముందుంటానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి జూనియర్ గోవర్ధన్రెడ్డి, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.