Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
ఈనెల 2న మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముప్పారం గ్రామానికి చెందిన కొల్లి నాగరాజు పెద్ద కుమారుడు యశ్వంత్కు బ్రెయిన్లోని ఎముకలు విరగడం వల్ల ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్కు రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపార. విషయం తెలుసుకున్న మాల మహానాడు నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాల మధు బాబు సోమవారం ముప్పారం కొల్లి నాగరాజు ఇంటికి వెళ్లి తన వంతుగా రూ.3000 ఆర్ధిక సాయం చేశారు.