Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
కేంద్రం తీసుకువచ్చిన కార్మిక, కర్షక వ్యతిరేక నూతన చట్టాలను రద్దు చేయాలని సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి కేమిడి ఉపలయ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్థన్ .సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మొరిగాడి రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. అడవయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు, జిల్లా కార్యదర్శి సుంచు దేవయ్య, దొంకెన శ్రీహరి , సుంచు యాకుబ్, బే జాడి కుమార్, ఇక్కిరి సహదేవు, ఎలుగల బాలయ్య,, ఎం.మోతీలాల్, తమ్మడి రమేష్, కె.గోపాల్ రెడ్డి, దార యాదగిరి, మంకయ్య,ఎన్.అంజిబాబు,మక్కాల మల్లేష్, కొమ్మి డి నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.