Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని హన్మాపురం గ్రామంలో నిరుపేదలైన కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్, సీపీఐ(ఎం)నాయకులు దయ్యాల నరసింహ మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని, వారికి వెంటనే ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ దయ్యాల నరసింహ, నాగపురి యాదగిరి, సాదినేని బాలమని, రాపాక బాలమ్మ, వలబోజు ముక్తాభారు, చిలుకల సతీష్, సత్యనారాయణ ,బాలకష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.