Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చివ్వెంల
గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ చంపులాల్ స్వామి జాతర సందర్భంగా ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ వేలంలో వ్యాపారులు సకాలంలో పాల్గొనాలని సర్పంచ్ ధరావత్ వీరన్న కోరారు. మంగళవారం చంపులాల్ దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగే జాతర సందర్భంగా తలనీలాలు సేకరణ, మిఠాయిలు, వరి పేలాలు, కొబ్బరికాయల వ్యాపారముల నిమిత్తం ఈ నెల 8న పులి తండా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నట్టు చెప్పారు.