Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి నాగార్జున్రెడ్డి
నవతెలంగాణ - తుంగతుర్తి
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. భూమికోసం, భుక్తికోసం, వెట్టి నుంచి విముక్తి కోసం సాగిన పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు మృతి చెందారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో దొరలకు వ్యతిరేకంగా పోరాడి పది లక్షల మందికి భూములు పంచి సామాన్యునికి స్వేచ్ఛ ఇచ్చిందని కమ్యూనిస్టులేనని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్రెడ్డి, శ్రీకాంత్వర్మ, కడెం లింగయ్య, భాస్కర్, అవిలయ్య, తాటి విజయమ్మ, పల్లా సుదర్శన్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.