Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ప్రయివేటు టీచర్ ఆత్మహత్య బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వెన్నం రవికుమార్ మృతదేహాన్ని బుధవారం ఆయన సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన బాగుందన్నారు. కేసీఆర్ విధానాలతోనే యువకులు అత్మహత్యలకు పాల్పడు తున్నారని అన్నారు. వెన్నం రవికుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.