Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
రాజీ మార్గమే రాజమార్గమని మున్సిఫ్ కోర్టు జడ్జి మణికంఠ అన్నారు. శనివారం స్థానిక కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్లో అన్నిరకాల సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. క్షణికావేశంలో తప్పులు చేసి సమస్యలు కొనితెచ్చుకోవద్దన్నారు. మెంబర్లుగా కేవి ప్రసాద్, భీమగాని శ్రీనివాస్ వ్యవహరించారు. మొత్తం 81 కేసులు రాజీ కుదిర్చామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిసా శ్రీనివాస్గౌడ్ తెలిపారు.