Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలపరిధిలోని లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం..బొప్పని సురేష్ (35) తన భార్యతో గొడవపడ్డాడు.ఈ క్రమంలో ఆమె ఏడాది కింద తన ఇద్దరి కుమారులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. 20 రోజుల కింద తల్లి రాములమ్మ కూడా కోతులను వెళ్లగొట్టబోయి కింద పడి దెబ్బలు తగిలి ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతుంది.దీంతో మనస్తాపం చెంది వరండాల్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మృతుని అక్క నాగలక్ష్మీఫిర్యాదు మేరేకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.