Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ ఆర్టీసీ డిపోలో టీఆర్ఎస్కేవీ అనుబంధం ఆర్టీసీ టీఆర్ఎస్ ఉద్యోగుల సంఘం నూతన కమిటీని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబుయాదవ్ సమక్షంలో ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.అనంతరం డిపో గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్, అధ్యక్షులుగా వెంకటయ్య, డిపో కార్యదర్శిగా బొడ్డుపల్లి అంతయ్య, ఉపాధ్యక్షులుగా జానిబాబు, డిపో అసిస్టెంట్ కార్యదర్శిగా మోహన్, కోశాధికారిగా విజయకుమార్, గ్యారేజీ కార్యదర్శిగా వెంకటేశంలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరిమితి రామావతారం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐతరాజు వెంకటేశ్వర్లు, అఖిల్, జోనల్ కార్యదర్శి పాపరాజు, జిల్లా కార్యదర్శి దయాకర్, హనుమంతు, ఎక్బాల్, చెన్నయ్య, నారాయణ, నర్సింహ పాల్గొన్నారు.