Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎస్.కె. చాంద్ పాషా ఎన్నికయ్యారు. ఈ నెల 12న కోదాడ పట్టణంలో జరిగిన ఆ అసోసియేషన్ ఎన్నికల్లో చాంద్ పాషా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి అసోసియేషన్ భవనం వరకూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చాంద్పాషా మాట్లాడుతూ లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు యాదయ్య, బలరామకృష్ణ, వెంకటయ్య, మల్లారెడ్డి, దేవేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, రవీందర్, నంద శ్రీను పాల్గొన్నారు.