Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా
నవతెలంగాణ - ఆలేరురూరల్
దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమైందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహా ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా మండలంలోని గుండ్ల గూడెం గ్రామం లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌల్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కుటుం బాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నామన్నారు. బీజేపీ హయంలో మహిళలకు రక్షణ కరువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన చైతన్య పాదయాత్ర బందం రధరసాధి ఎమ్డి.జహంగీర్, సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధరావత్ రమేష్నాయక్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు, మండల కార్యదర్శి మొరుగాడి రమేష్, టౌన్ కార్యదర్శి ఎక్బాల్, గ్రామ కార్యదర్శి కొళ సదానందం, పార్టీ నాయకులు మేకల గంగమ్మ, బాలరాజు, ఉపేంద్ర, సత్తయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.