Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
వికలాంగులకు విస్తతమైన ఉపాధి అవకాశాలను కల్పించాలని ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో వికలాంగుల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వమే కొని ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ ఉపాధి కల్పించాలని, బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, వికలాంగులకు బ్యాంకుల ద్వారా ఎలాంటి షరతులు లేకుండా 100శాతం సబ్సిడీతో రూ. 10 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు స్వర్ణలత, జోగు అంజలి, జెల్లా ఉపేందర్, నవీన్, నరసమ్మ పాల్గొన్నారు.