Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఆత్మహత్య చేసుకున్న విద్యావాలంటీర్ పాలకూరి శైలజది ప్రభుత్వ హత్యేనని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.విజరుకుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఉన్న శైలజ కుటుంబాన్ని వారు పరామర్శించి మాట్లాడారు. పాపకు తిండి పెట్టలేక పూటగడవక, భర్త పడుతున్న ఆవేదనను చూసి శైలజ ఆత్మహత్య చేసు కుందన్నారు. 15 నెలలుగా విద్యావాలంటీర్లకి వేతనాలు ఇవ్వక పోతే వారి కుటుంబం ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. విద్యా వాలెంటీర్లను రెన్యూవల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్, పట్టణ సహాయ కార్యదర్శి కార్లపూడి రాము, జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు, పట్టణ నాయకులు రఘువరణ్, కిరణ్, మనోహర్, సుమన్, యువరాజు తదితరులు పాల్గొన్నారు.