Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాలిగౌరారం : సీపీఐ(ఎం) నుంచి సిర్పంగి రాములును సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ మండల కార్యదర్శి మారోజు చంద్రమౌళి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నందున ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి సీపీఐ(ఎం)తో ఆయనకు ఎలాంటి సంబంధమూ ఉండదన్నారు. ఇప్పటి నుండి పార్టీ పేరుతో ఆయన ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించినా వాటితో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.
నకిరేకల్ : టీఆర్ఎస్లో చేరిన వారికి సీపీఐ(ఎం)తో ఎలాంటి సంబంధం లేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరిన వారు మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా వారి నుంచి పార్టీ సభ్యత్వాలు కూడా ఇప్పటి వరకూ తీసుకోలేదని తెలిపారు.