Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడ:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి కృష్ణా జలాలను అందించే దిశగా చొరవ చూపినప్పటికీ ఇటీవల కాలంలో కేబుల్ వైర్ల కోసం పైప్లైన్ సమీపాన కాంట్రాక్టర్లు తవ్వి వదిలేయడంతో శివన్నగూడ సబ్స్టేషన్ సమీపాన కొన్నిరోజులుగా ఈ కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయి. సరఫరా జరుగుతున్న సమయంలో నీరు బహిర్గతమై అనంతరం అంతర్గతం వెళ్లడంతో సరఫరా జరిగే సమయానికి చురుగ్గా మారుతుందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపి పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టి కృష్ణా జలాలు కలుషితం కాకుండా చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.