Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లాలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజా సమస్యలు మన ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని అసెంబ్లీలో ఉత్సవ విగ్రహాలుగా మారారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టు పల్లి అనురాధ విమర్శించారు. జనచైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా సీపీఐ(ఎం) కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వేలాది సంఖ్యలో రేషన్కార్డుల కోసం, పింఛన్ల కోసం, ఇండ్ల్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. జిల్లాలో చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు గొంతు ఎత్తి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రగతి భవన్ ముట్టడించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.