Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం నాయకులు ధరావత్ రమేష్ నాయక్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జన చైతన్య పాదయాత్ర చేయడం ద్వారా తనకు గ్రామాల్లో ప్రజలు జీవిస్తున్న విధానం వారి సమస్యలపై అవగాహన వచ్చిందని గిరిజన సంఘం నాయకులు దరావత్ రమేష్నాయక్ తెలిపారు. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో గతంలో గిరిజనులకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కునేందుకు ఫారెస్ట్ అధికారులచే ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. గ్రామంలో కూడా సంచార జాతులు గిరిజనులకు ఇంటికి వస్తారని వారికి అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత గిరిజనులకు ఇస్తామన్న రిజర్వేషన్లను అమలు చేయాలని, తండాలను పూర్తిస్థాయిలో అభివద్ధి పరచాలని కోరారు.