Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాలైన పాలకవీడు, అలింగాపురం, గుడుగుంట్లపాలెం, నాగిరెడ్డిగూడెం, శూన్యపహాడ్, బొత్తలపాలెం, జాన్పహాడ్, రాఘవాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిస ిపోయింది. అలాగే కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఆ బస్తాలు కూడా తడిసిపోయాయి.అలాగే వీచిన గాలికి 35 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. రహదారులపై చెట్లు కూలి పోయాయి.గాలికి విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ విద్యుత్కు అంతరాయం కలగడంతో గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులెదుర్కొన్నారు.అలాగే రోడ్లపై చెట్లకొమ్మలు పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.