Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
మేడేను ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి నూనె రామస్వామి కోరారు. గురువారం పట్టణంలో నిర్వహించిన ఏఐటీయూసీ డివిజన్ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కాలంలో పనులు దొరక్క కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్మికుని కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి జూలూరి వెంకట్రాములు, ఆలమోని మల్లయ్య, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి తోటపల్లి నగేష్, మల్లేశ్ పాల్గొన్నారు.