Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలో మంగళవారం రాత్రి కురిసిన అకాలవర్షానికి, విపరీతమైన గాలులకు మామిడి కాయ నేలరాలింది.మండలపరిధిలోని తొగర్రాయి, గణపవరం, కూచిపూడి, కాపుగల్లు గ్రామాలలో మామిడితోటలలో మామిడి కాయలు నేలరాలాయి.కాపుగల్లు గ్రామంలో దాచేపల్లి శ్రీనివాస్ నాలుగెకరాల మామిడితోటను రూ.16 లక్షలకు కౌలుకు తీసుకోగా అకాలవర్షానికి రూ.1.5 లక్షల విలువైన కాయలు నేలరాలాయి.అసలే దిగుబడి తగ్గిందనుకుంటే అకాలవర్షం నిండా ముంచిందని వాపోయాడు.మామిడి కౌలు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
హుజూర్నగర్ : మండలపరిధిలోని గోవిందపురం, లకారం, హుజూర్నగర్ గ్రామాలలోనూ, యుపట్టణంలోని పలు మామిడితోటల్లో మంగళవారం రాత్ర ఈదురుగాలుల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి.గోవిందపురం గ్రామంలోని గుర్రం వెంకరెడ్డి తోటలో సుమారు మూడు టన్నుల మామిడికాయల నేలరాలాయి.తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో శీలంశెట్టి వీరబాబు, కూర కొండలు, శ్రీను పాల్గొన్నారు.