Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-చింతపల్లి
ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేద కుటుంబాల పాలిట వరమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొడుకొండ్ల వద్ద ఎర్రమట్టితండా గ్రామం రమావత్ బుజ్జికి మంజూరైన రూ.30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసి మాట్లాడారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాదేపల్లి పులిరాజ్ గౌడ్, బొటిమీది తండా సర్పంచ్ చందర్ నాయక్ పాల్గొన్నారు.