Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
శివన్నగూడ గ్రామానికి చెందిన లెంకలపల్లి వీరనారాయణ సీపీఐ(ఎం)కు చేసిన సేవలు మరువలేనివని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు.రెండు రోజుల కింద వీరనారాయణ గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢసానుభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవర్గాల అభ్యున్నతికి కషి చేసిన ఘనత నారాయణకు దక్కిందన్నారు.బూర్జువా పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన పార్టీ వెంటే ఉన్నారన్నారు.ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.1995 నుండి పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఆయన వ్యక్తిగత స్వభావానికి నిదర్శనం గా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆకుల వెంకటరామ్, సహాయ కార్యదర్శి ఏర్పులయాదయ్య, ఎ.రఘుమారెడ్డి, మైలసత్తయ్య పాల్గొన్నారు.