Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎలుగల బాలయ్య పార్టీ నిర్ణయాలకు కట్టుబడి క్రమశిక్షణతో చేసిన సేవలు ప్రశంసనీయమని ఆ పార్టీ ఎండి. జహంగీర్ అన్నారు. బాలయ్య శనివారం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆదివారం మండలకేంద్రంలో బాలయ్య కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు, మాటూరి బాలరాజుగౌడ్తో కలిసి మాట్లాడారు. బాలయ్య తన జీవితాంతం పేద ప్రజలు, రైతులు, కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఎర్ర జెండా నీడలో పోరాడిన దిశాలి అనికొనియాడారు. సీపీఐ(ఎం) ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఆ పార్టీ మండల పట్టణ కార్యదర్శులు మొరిగాడి రమేష్, ఎంఏ .ఇక్బాల్, నాయకులు వడ్డె శ్రీనివాసులు, మంగ అరవింద్ , చెన్న రాజేష్, తదితరులు ఉన్నారు.