Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
నాణ్యత లేని విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తప్పవని అగ్రికల్చర్ ఏవో జానకిరాములు హెచ్చరించారు.సోమవారం మండలకేంద్రంలోని శ్రీనివాస్ ఫంక్షన్హాల్లో మండల సీడ్ డీలర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విత్తన దుకాణాల యజమానులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు నకిలీ విత్తనాలు కొన్ని మోసపోవద్దన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.రశీదు విధిగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో హాలియా ఏడీఏ జగదీశ్వర్రెడ్డి, ఎస్సై సుధాకర్, మండలంలోని సీడ్ డీలర్స్ పాల్గొన్నారు.