Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే నోముల భగత్
నవతెలంగాణ-నిడమనూరు
గతంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న చెరువు కట్ట మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని వెంగన్నగూడెం గ్రామంలో ఉన్న చెరువును ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్న సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, వెంకటేశ్వర దేవస్థాన చైర్మెన్ మేరెడ్డి వెంకట రమణ, ఉన్నం ఈశ్వర్, ఉప సర్పంచ్ వెంకన్న, శివ, అయోధ్య తదితరులు పాల్గొన్నారు.