Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
రైతుల నూతన నాణ్యమైన వంగడాలు ఎంచుకోవాలని అన్నదాత ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ సీడ్స్ డీలర్ ఏనుగు శైలజరెడ్డి,ఎస్.శివారెడ్డి రైతులను కోరారు.శుక్రవారం మండల కేంద్రంలోని అన్నదాత ఫర్టిలైజర్స్ షాపులో రైతులకు నూతన వంగడాలైన మిర్చి, పత్తి విత్తనాలను రైతులకు సరసమైన ధరలకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మావద్ద అన్ని రకాల విత్తనాలు, ఎరువులు ఉన్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, ఉప్పలయ్య, జట్ట సోమిరెడ్డి, మోహన్రెడ్డి ఉన్నారు.