Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
వ్యవసాయబావిలో పడి యువకుడు మతి చెందిన ఘటన మండలపరిధిలోని నర్సింహాపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం...నర్సింహాపురం గ్రామ పంచాయతీపరిధిలోని శ్రీ క్రిష్ణ హోం కాలనీకి చెందిన చదలవాడ అమర్(15) గురువారం సాయంత్రం తన స్నేహితులతో ఆడుకునేందు బయటకు వెళ్ళాడు. రాత్రి పొద్దుపోయేంత వరకు తల్లిదండ్రులు వెతికినా జాడ కన్పించలేదు.మరుసటి రోజు నర్సింహాపురం వెళ్లేదారిలో కేశగాని వెంకన్న పొలం వ్యవసాయబావిలో అమర్ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించారు.మతుడి తల్లి సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.