Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారి65కు 8లైన్లకోసం ప్రాజెక్టు రూ.600 కోట్లు కేటాయింపు
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
నకిరేకల్-నాగార్జునసాగర్ జాతీయ రహదారి 565కు రూ.390కోట్లు నిధులు మంజూరైనట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రెండు జాతీయ రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరడంతో కేంద్రం నిధులు కేటాయించిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తన పరిధిలో పూర్తైన రెండు జాతీయ రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్చువల్ విధానంలో హైదరాబాద్లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తను చేసిన కషికి ఇప్పటికే రెండు జాతీయ రహదారుల విస్తరణ పనులు పూర్తయి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టు వివరించారు. అలాగే పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి పదేపదే విన్నవించుకోగా మరో రెండు జాతీయ రహదారుల పనులకు నిధులు మంజూరైనట్టు తెలిపారు. పూర్తైన రహదారుల్లో వాటిల్లో జాతీయ రహదారి నెంబర్ 365లో నకిరేకల్ నుంచి తానంచెర్ల వరకు మొత్తం 66.563 కిలోమీటర్ల రోడ్డు పనులు రూ. 605.08 కోట్లతో పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే జాతీయ రహదారి 163లో యాదాద్రి నుంచి వరంగల్ వరకు 99.103 కిలో మీటర్ల రోడ్డును రూ. 1889.72 కోట్లతో పూర్తిచేసి నేడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వివరించారు. పలుమార్లు కలిసి నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని కోరినట్టు తెలిపారు. మరో ప్రాజెక్టు హైదరాబాద్ నుండి విజయవాడ65 జాతీయ రహదారిఎల్బీనగర్ నుంచి అందోల్ మైసమ్మ(గుడిమలకపూర్) వరకు ఆరులైన్లుగా ఉన్న జాతీయ రహదారి ని 8లైన్లుగా మార్చాలని విన్నవించినట్టు తెలిపారు. దీంతో నేడు నకిరేకల్ - నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రూ. 390 కోట్లు, ఎల్బీనగర్ - అందోల్ మైసమ్మ ప్రాజెక్టుకు రూ. 600 కోట్లను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేటాయించినట్టు తెలిపారు.