Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ -మునుగోడు
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆదివారం నవ తెలంగాణలో ప్రచురితమైన 'ఇసుక దెబ్బలే కుర్చీలు' అనే కథనానికి స్పందన వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్లుగుబెల్లి నర్సిరెడ్డి ఆదివారం ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం కరోనా వ్యాక్సిన్ టెస్ట్ల వివరాలు వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ టెస్టుల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య సమస్యల కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన నిరుపేద కుటుంబాలకు మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన నిబంధనల ప్రకారం ప్రతి నియోజకవర్గ కేంద్రానికి వంద పడకల ప్రభుత్వాస్పత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు.