Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కరోనా బారిన పడి మరణించిన వారిని మానవత్వంతో ఖననం చేయడం ప్రాణాలకు తెగించి సాహసం చేయడం గొప్ప విషయమని ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి అన్నారు.సోమవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సొంతవారు సైతం ఖననం చేయడానికి భయపడుతున్న తరుణంలో మేమున్నామంటూ దైర్యంగా ముందడుగేసి వారి అంతిమ కార్యక్రమాలు నిర్వహించడమే కాక కరోనా సోకిన వారికి సైతం సేవ చేస్తున్న జహంగీర్, హనీ, బల్వంత్ సింగ్, ముక్విత్, అఫ్రోజ్ మిత్ర బందం చేస్తున్న సేవలకు స్పందించి వారికి అవసరమైన మాస్క్లు,గ్లౌస్లు శానిటైజర్ కిట్లతో పాటు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో 9 వార్డు కౌన్సిలర్ మదార్ పాల్గొన్నారు.