Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులకు ఎమ్మెల్యే వినతి
నవతెలంగాణ - కోదాడరూరల్
నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని కోరుతూ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గురువారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావులను హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామని, ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. కోదాడ ప్రభుత్వాస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చాలని కోరారు. రేషన్ డీలర్ల సమస్యలను మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి వారికి న్యాయం చేయాలని మంత్రులను కోరినట్టు తెలిపారు.