Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికుల జీతాల నుండి యాజ మాన్యం రికవరీ చేసిన సీసీఎస్ డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం నార్కట్పల్లి డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎర్రబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొప్పు యాదగిరి, అనిల్కుమార్ పాల్గొన్నారు.
దేవరకొండ:యాజమాన్యం సీసీఎస్ సభ్యుల నుండి ప్రతినెలా జీతంలో రికవరీ చేసిన డబ్బులు సీసీఎస్కు జమ చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దేవరకొండ డిపోలో శనివారం రెడ్బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి ఆర్ఎస్రావు, ఎంజె.ఖాన్, దీప్లాల్, బి.యాదయ్య పాల్గొన్నారు.