Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే కుటుంబంలో ముగ్గురు మతి
నవతెలంగాణ-చివ్వెంల
భార్యా భర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో భార్య తన ఇద్దరు పిల్లలను చంపి ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి నడిగూడెం మండలం రామాపురంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న పొడిశెట్టి శ్రీనాథ్కు భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు.మౌనిక వారి మేనమామ కుటుంబాల మధ్య భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం మౌనిక మేనమామ ఇంట్లో జరిగిన శుభకార్యానికి తన భర్త శ్రీనాథ్ హాజరయ్యాడు.ఇంటికి తిరిగి వచ్చిన భర్త శ్రీనాథ్తో మౌనిక తమకు పడని కుటుంబసభ్యులు ఇంటికి ఎందుకు వెళ్లావని వాగ్వాదానికి దిగింది.దీంతో శ్రీనాథ్ తన భార్యతో ఎలాగు కార్యక్రమానికి వెళ్లి వచ్చానని సర్దిచెప్పి గ్రామంలో పేషెంట్లను చూసేందుకు వెళ్లాడు.దీంతో మౌనిక తమతో భూవివాదాలున్న తమ బంధువుల ఇంటికి భర్త వెళ్లడాన్ని జీర్ణించుకోలేక క్షణికావేశానికిగురై ముందు తన పిల్లలిద్దరికీ ఉరివేసి చంపి, ఆ తర్వాత తాను ఇనుపవైరుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.గ్రామంలో పేషెంట్లను చూసేందుకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనాధ్ తలుపు తీసేసరికి ఇంట్లో తన భార్య మౌనిక (28), కూతురు లాక్షిత (3) కుమారుడు(1) విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో శ్రీనాథ్ అరుస్తూ కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి మతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ముక్కు పచ్చలారని పసిపిల్లలు తల్లి క్షణికావేశంతో ఉరివేసి చంపడంతో కుటుంబసభ్యులు బంధువుల, రోదనలు మిన్నంటాయి.కాగా మౌనికది నడిగూడెం మండలం కేశవపురం గ్రామం కాగా భర్తది చివ్వెంల మండలం అక్కల దేవి గూడెం గ్రామం.కాగా మౌనిక ఆత్మహత్య వెనుక భూ వివాదాలే ఉన్నాయా.. మరేవైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.