Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
స్థానిక అంబేద్కర్ గ్రంథాలయంలో దళిత మహాసభ వ్యవస్థాపకుడు, స్వేచ్చ సమానత్వ ఉద్యమకారుడు, ప్రజా హక్కుల పోరాట యోధుడు, చుండూరు, మానవ హక్కుల నేత, ఆర్బీఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బొజ్జాతారకం 82వ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు.ఆలిండియా సమతా సైనికదళ్ నల్లగొండ జిల్లా శాఖ వారు అంబేద్కర్ గ్రంథాలయ చైర్మెన్ న్యాయవాది పొట్టచెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ తారకం చేసిన దళితఉద్యమాలు, సేవల గురించి కొనియాడారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఆలిండియా సమతా సైనిక దళ్ జిల్లా కన్వీనర్ బుర్రి వెంకన్న, దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి యేకుల సురేష్, దేవరకొండ డివిజన్ ఎస్సీ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రెటరీ పొట్టరాములు, అడ్వకేట్ మాతంగిసురేష్, అంకూరి శివ, గిరి పాల్గొన్నారు.