Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో చేనేత కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం అందజేయాలి
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులెదుర్కొంటున్న నేతన్నలకు చేయూతనందించాలని బీసీ జేఏసీ నేత మారం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లా డారు.కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వేలాది నిరుపేద చేనేత కుటుంబాలు ఆర్థికఇబ్బందులతో కొట్టుమిట్టాడు తున్నా యన్నారు.చేనేత కార్మికుల సాధికారత కోసం ప్రభుత్వం కషి చేయాలని ఆకాంక్షించారు.అర్హులైన నిరుపేద చేనేత కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అభ్యర్ధించారు. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చేనేత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతేడాది ఆగస్టు15న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి మండలంలో మానుపురం గ్రామానికి చెందిన 30 చేనేత కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఓ వద్ధురాలు మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకొచ్చి ందన్నారు.వారందరికీ ప్రభుత్వ సాయం అందించాలని అభ్యర్ధించిందన్నారు.దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చేనేత కార్మికుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అంద జేయాలని కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్ను ఆదేశించా రన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ కోవిడ్ విసిరిన పంజా కారణంగా అతలాకుతలమైన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ్ అభ్యర్ధించారు. సిరిసిల్ల జిల్లాలోని చేనేత కార్మికులకు అందించే చేయూత, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నేతన్నలందరికీ వర్తింపచేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవాలని ఆకాంక్షించారు. చేనేత కార్మికులు నేత వేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని కోరారు.