Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వల్లంభట్ల శ్రీనివాసరావు
నవతెలంగాణ - అడ్డగుడూర్
మరియమ్మ లాకప్డెత్కు కారణమైన పోలీసులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి వల్లంభట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 18న అడ్డగుడూర్ మండల పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కు గురైన మహిళా కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను నిరంతరం కాపాడే దిశగా అన్ని విధాలుగా చర్యాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు బుర్రు అనిల్ కుమార్, బాలకష్ణ,జోజప్ప,తదితరులు పాల్గొన్నారు.