Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లా కేంద్రంలోని మాలిపురుషోత్తమ్రెడ్డి స్మారకభవనంలో సీపీఐ(ఎం) ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు అద్భుతమని తిప్పర్తి మండలం ఖాజీరామారంకు చెందిన గంటెగంపు రాంబాబు, ఆయన భార్య అనిత అన్నారు.మంగళవారం వారు 'నవతెలంగాణ'తో మాట్లాడారు.తాము 12 రోజుల కింద కరోనా బారిన పడడంతో ఆర్థికస్థోమత లేక స్నేహితుల సమాచారంతో సీపీఐఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్కేంద్రంలో జాయిన్ అయ్యామన్నారు.సెంటర్లో తమకు మూడుసార్లుఉచిత వైద్యం అందించడంతో పౌష్టికాహారం అందించారన్నారు.ప్రస్తుతం కరోనా నెగిటివ్గా నిర్దారణ కావడంతో చాలా సంతోషంగా ఉన్నామన్నారు.తమకు వైద్య సేవలందించి ప్రాణాలు కాపాడిన ఐసోలేషన్సిబ్బంది, సీపీఐ(ఎం) సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.