Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాపాడిన ఆటోడ్రైవర్
నవతెలంగాణ-భూదాన్పోచంపల్లి
చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన ఆటోడ్రైవర్ ఆమెను ప్రాణాలతో కాపాడిన సంఘటన మంగళవారం పట్టణకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ కేంద్రంలోని బసవ లింగేశ్వర కాలనీకి చెందిన వేముల నిర్మల కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు స్థానిక చెరువులోకి దూకింది. అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్ కట్కూరి రాజు చెరువులో మునిగిపోతున్న ఆమెను గమనించి వెంటనే ఆటోను ఆపి చెరువులోకి దూకాడు. ఆమెను బయటికి లాగి ప్రాణాలు కాపాడాడు. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు నిర్మలను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలిపారు.