Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
- నిద్రమత్తులో అధికారులు
నవతెలంగాణ-నల్లగొండ
చట్టాలెన్ని వచ్చినా అక్రమార్కులకు చుట్టాలుగానే మారుతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహ రిస్తున్నారు. దీంతో అవినీతిపరుల ఆగడాలు 'మూడుపువ్వులు ఆరు కాయలు' అన్న చందంగా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అను గుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలకు ఇటుకలను వాడు తుండడంతో నిర్వాహకులు అనుమతుల్లేకుండానే యథేచ్ఛగా ఇటుకబట్టీలు నిర్వహి స్తున్నారు. అటవీ కలప, బొగ్గును ఇటుకలు కాల్చేందుకు విని యోగి స్తున్నా సంబంధిత అధికారులు మొద్దునిద్ర వీడడం లేదన్న విమర్శలు బహిరంగంగానే వినవస్తున్నాయి.
జిల్లాలోని పలు మండలాల శివారులో ఇటుక బట్టీల నిర్వాహణ ఏండ్ల నుంచి జరుగుతూనే ఉంది.ఈ బట్టీలను ఏర్పాటుచేయాలంటే రెవెన్యూ అధికారులు అనుమతులు తప్పనిసరి.అయితే అనుమతులు లేకుండానే యథేచ్ఛగా ఇసుకబట్టీలను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు.రెవెన్యూ అను మతుల్లేకుండా అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ చత్తీష్ఘడ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా కార్మికులను పిలిపించుకొని వారి ద్వారా తమ పనులను కొనసాగిస్తున్నారు .
పచ్చని పొలాలలో సైతం..
భూ పరిరక్షణ చట్టం 129/12లో పొందుపరిచిన విధంగా వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహించాలి.అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలను విరుద్ధంగా పంటపొలాల్లో హైవే రోడ్ల పక్కన ఇటుకబట్టీలు ఏర్పాటు చేస్తున్నారు.రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సంబంధిత అధికారులకు మామూలు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.పచ్చని పంటపొలాల పక్కన ఇటుకబట్టీలు వేస్తుండడంతో ఇటుకబట్టీల ప్రభావం పంటపొలాలపై పడి పంటలు నష్టపోతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ అండదండలతో నిర్వాహకుల హవా ...
ఇటుకబట్టీల వ్యాపారులు రాజకీయ అండదండలతో అనుమతులు లేకుండా విద్యుత్చౌర్యం, కలప అక్రమరవాణా చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించు కోకపోవడం మూలంగా వారు ఇష్టానురాజ్యంగా దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు విన వస్తున్నాయి.
మైనింగ్, రవాణా శాఖ నుంచి అనుమతులు నిల్..
సాధారణంగా ఇటుకబట్టీల్లో వాడే మట్టి ఇసుకకు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా మట్టిని, ఇసుకను వాడుతున్నట్టు సమాచారం. ఇటుక బట్టీలో కావలసిన నీటిని అక్రమంగా వాగులు కుంటలు కాల్వలు చెరువులకు మోటార్లు ఏర్పాటుచేసి నీటిని వాడుకుంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు .
కార్మిక శాఖ అనుమతులు లేకుండానే..
ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో కూలీలను తీసుకువచ్చి వారి వివరాలను సంబంధిత శాఖకు తెలియజేయకపోవడం.కనీస వేతనాలు చెల్లించకపోవడం.నిర్బంధ కూలీలుగా భావించడం.వారికి కనీస అవసరాలైన వసతి తాగునీరు ఏర్పాటు చేయడం లేదు.పర్యావరణానికి కాలుష్యం జరిగే విధంగా చట్ట విరుద్దంగా హిట్ కాబట్టి నన్ను నిర్వహిస్తున్నారు . పర్యావరణ కాలుష్య నియంత్రణ శాఖ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు జనావాస ప్రాంతాలను 1కిలోమీటర్ల దూరంలో,పంట పొలాలకు 100 మీటర్ల దూరంలో ,హైవేకు 200 మీటర్ల దూరంలో ఉండాలి.ఇటుకలు కాల్చిన తర్వాత వచ్చే బూడిదను నిర్దేశించిన ప్రాంతాలకు తరలించాలి.కానీ ఇవేమీ చేయకుండా వాతావరణ కాలుష్యం జరిగే విధంగా ఉంచుతున్నారు.దీనికి తోడు అక్రమ కలప బొగ్గును ఇటుకబట్టీల్లో ఇటుకలు కాల్చడానికి వాడుతుండడంతో చెట్ల సంఖ్య తగ్గి కాలుష్యం పెరుగుతుంది.