Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
మండల పరిధిలోని పిట్టలగూడెం గ్రామంలో శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలని కోరుతూ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం పిట్టల గూడెం గ్రామస్తులు శ్మశాన వాటిక సమీపంలో బోరు వేస్తుండగా చాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. కల్లూరి మల్లేశం సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బోరు వేస్తున్న సమయంలో అడ్డుకోవడం సరి కాదన్నారు. గతంలో పిట్టలగూడెం గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వాటిని వెంటనే పరిష్కరిొచాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల కార్యదర్శి బొలగాని జయరాములు, పోతుగంటి బిక్షపతి, కాలియ గోపాల్, విజరు, తుమ్మల మల్లేశం, నాయక్, జంపన్న, రాజు, బికారి తదితరులు ఉన్నారు.