Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లుగా ప్రారంభానికి నోచని పంచాయతీ భవనం
- ఇరుకు భవనంలోనే పాలన
నవతెలంగాణ-పెన్పహాడ్
ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తోంది. రూ.లక్షలు పెట్టి భవనాలు నిర్మించినా ప్రారంభించడం లేదు. మండల పరిధిలోని దుపహాడ్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి తొమ్మిదేండ్ల క్రితం శంకుస్థాపన చేశారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల నిర్మాణం కొంత ఆలస్యమైంది. ఎలాగొలా..నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణం పూర్తి చేసి మూడేండ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచడం లేదు. నేటికీ గ్రామంలో సర్పంచ్, గ్రామ అధికారులు పాత ఇరుకైన భవనంలోనే పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం పెచ్చులు ఊడిపడుతున్నాయి. అయినా అధికారులు, ప్రజాప్రతి నిధులు పట్టించుకోవడం లేదు. కొత్త భవనం సిద్ధమైనా దాన్ని ఎందుకు ప్రారంభించడం లేదనేది ప్రశ్న. ఇప్పటి కైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.