Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు
నవతెలంగాణ -భువనగిరి రూరల్
బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంగా ఎయిమ్స్ గా ప్రకటించి సరిపడ భూమిని తీసుకుందన్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలకు ఎయిమ్స్ చాలా ఉపయోగపడుతుందన్నారు.. డాక్టర్లు ల్యాబ్ టెక్నీషియన్స్ ఇతర వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి వైద్యసేవలందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, మండల కార్యదర్శి ముదిగొండ.రాములు, గుండ్ల లక్ష్మయ్య, సోమన ఐలయ్య, చిక్క బిక్షపతి,దాసరి లక్ష్మయ్య శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.